ఏపీ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పుష్ప -2 జాతర ఘనంగా రికార్డులు మోత మోగిస్తున్న వేళ ... చిత్తూరు జిల్లా కుప్పంలో ఆ సినిమాను ప్రదర్శిస్తున్న రెండు థియేటర్లను  మూసివేయటం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల  అయినప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ మూడ్ లో ఉన్నారు. ఓవర్సీస్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. ప్రీమియర్ షో లకు అనూహ్య స్పందన కనిపించింది. తొలి రోజే రూ. 294 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తున్న పుష్ఫ చిత్రం రానున్న రోజుల్లో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే సమయంలో కుప్పంలో  పుష్ఫ సినిమాను ప్రదర్శిస్తున్న రెండు థియేటర్లను అధికారులు సీజ్ చేయడం సంచలనం కలిగించింది. అధికారులు సినిమా ప్రదర్శనను అర్ధాంతరంగా  నిలిపివేసి మరీ థియేటర్‌కు తాళాలు వేశారు.

ఈ రెండు థియేటర్లు టీడీపీ నేత కు చెందినవిగా చెబుతున్నారు. సీజ్ చేయటం పైన అధికారులు కారణాలు వెల్లడిస్తున్నారు. ఈ థియేటర్లకు అవసరమైన అనుమతి పత్రాలు లేవని... ఈ రెండు థియేటర్ల యాజమాన్యం లైసెన్సు రెన్యూవల్ చేయకపోవడంతో పాటుగా ఎన్‌ఓసీ లేకుండా ప్రదర్శనలు కొనసాగించటం చట్ట విరుద్దమని అధికారులు వివరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే ధియేటర్ల విషయంలో కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. అయితే, పుష్ఫ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే అధికారులు ఈ రకంగా చర్యలు తీసుకోవటం ఏమిటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos