రాజధాని అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం నిర్మించిన 400/220కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను (జీఐఎస్) సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ కేంద్రాన్ని రాజధాని ప్రాంతంలోని తాళ్లాయపాలెంలో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. రాజధాని ప్రాంతానికి ఇప్పటివరకు 220/132/33కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది.
అమరావతి నిర్మాణం జరుగుతున్నందున భవిష్యత్తులో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు ఇప్పట్నుంచే ప్రణాళికాయుతంగా ముందుకెళుతున్నారు. మైలవరం, బేతంచర్ల, పెనుకొండ, కోటలో సబ్స్టేషన్లను ఆన్లైన్లో ప్రారంభిస్తున్నారు. రూ.4,665 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అల్లూరి జిల్లాలో అప్పర్ సీలేరు పవర్ స్కీమ్ కోసం రూ.1,753 కోట్లు కేటాయించారు. సీఆర్డీఏ పరిధిలో లైన్ల మార్పుల కోసం రూ.1,042 కోట్లు , కొన్నిచోట్ల భూగర్భ కేబులింగ్ పనుల కోసం రూ.824 కోట్లు కేటాయించారు.
కాగా రాష్ట్రంలో తొలిసారిగా ఈ కేంద్రాన్ని రాజధాని ప్రాంతంలోని తాళ్లాయపాలెంలో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. రాజధాని ప్రాంతానికి ఇప్పటివరకు 220/132/33 కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. అమరావతి నిర్మాణం జరుగుతున్నందున భవిష్యత్తులో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు ఇప్పట్నుంచే ప్రణాళికాయుతంగా ముందుకెళుతున్నారు.
ఇక్కడి నుంచి నేలపాడులో నిర్మించే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రానికి సరఫరా చేస్తారు. తాడేపల్లిలోని 132 కేవీ కేంద్రాన్ని 220కేవీగా అప్గ్రేడ్ చేసి తాళ్లాయపాలెం జీఐఎస్ నుంచి సరఫరా తీసుకుంటారు. వీటి ద్వారా రాజధానిలోని అన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా అవుతుంది. తాడికొండ విద్యుత్తు కేంద్రానికి ఇవి ప్రత్యామ్నాయం కానున్నాయి. అటు తాడికొండ, ఇటు తాళ్లాయపాలెం 220/33కేవీ విద్యుత్తు కేంద్రాల నుంచి రాజధాని ప్రాంతానికి విద్యుతు సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తారు.
తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలతోపాటు పరిశ్రమలకూ అంతరాయం లేని విద్యుత్తు సరఫరాకు తోడ్పడుతుంది. తాళ్లాయపాలెం జీఐఎస్ కేంద్రం నుంచి రాజధాని అమరావతిలో 220/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలకు సరఫరా చేస్తారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos