ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో వెలువడనున్న క్రమంలో  ఏపీలో అన్ని ప్రధాన పార్టీలు మైండ్ గేమ్ స్టార్ట్ స్టార్ట్ చేశాయి. గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి వైసీపీ, టీడీపీ సిద్దంగా లేవు. పోస్టల్​ బ్యాలట్ల చెల్లుబాటుపై ఇటీవల ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను సవాల్​ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించడానికి శ్రీకారం చుట్టింది. దేశమంతటా ఒక రూల్​ ఉంటే ఇక్కడ మాత్రమే మార్చడమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్​ బ్యాలట్లపై గెజిటెడ్​ ఆఫీసర్​ డిక్లరేషన్​తో సంతకం లేకున్నా చెల్లుబాటు అవుతుందనే అంశంపై వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వైసిపి న్యాయ పోరాటం చేస్తోంది.
ఇదిలా ఉండగా ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఏ పార్టీ కూడా ఓటమిని అంగీకరించదు. తామే గెలుస్తామని ఢంకాబజాయించి మరీ చెప్పడం సాధారణమే. పరాజయాన్ని ముందుగానే ఒప్పుకుంటే పార్టీ శ్రేణులు చెల్లాచెదురైపోతాయనే భయమే ఇందుకు కారణం. కాగా, వైసీపీ అధినేత జగన్​ సొంత సంస్థల ద్వారా సర్వే చేయించుకొని గెలుపు మీద ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఆ పార్టీ నేతలు విశాఖపట్నం ఆంధ్రా విశ్వ విద్యాలయంలో 9న ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సిద్దమవుతున్నారు. పార్టీ విజయంపై ఎలాంటి అనుమానాలు లేవని.. పోలింగ్​ వన్​సైడ్​ జరిగిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. క్యాడర్​ భారీ ఎత్తున విశాఖ తరలి రావాలని కోరుతున్నారు. సీఎంగా జగన్​ రెండోసారి చేసే ప్రమాణస్వీకారం నభూతో.. నభవిష్యత్తు అన్నట్లు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు ఏర్పాట్లకు కసరత్తు చేస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా నుంచి బుధవారం హైదరాబాద్​ చేరుకున్న విషయం తెలిసిందే.  శుక్రవారం పవన్​తోపాటు కూటమి నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. కూటమి పార్టీల్లో ఈపాటికే గెలుస్తున్నామనే ధీమా వచ్చేసింది. అంతటి భారీ పోలింగ్​ నమోదయిందంటే.. అది ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనని కూటమి నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. పోలింగ్​ బూత్​ స్థాయి నుంచి సమాచారం తెప్పించుకున్నారు. మొత్తం లెక్కలేసి కూటమి విజయం తథ్యమంటున్నారు. చంద్రబాబుతో జరిగే సమావేశంలో మంత్రి పదవుల గురించి చర్చించవచ్చని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇలా ఇరుపార్టీలూ  విజయంపై ధీమా వ్యక్తం చేయడంపై కాంగ్రెస్​ సీనియర్​ నేత రఘువీరారెడ్డి స్పందిస్తూ... వైసీపీ లేదా కూటమి గెలిచినా 95 నుంచి 97 స్థానాలు రావొచ్చని అన్నారు. దీన్నిబట్టి విజయం రెండు పక్షాల్లోనూ దోబూచులాడుతున్నట్లు గా అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

14-55-06-0506.jpg

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్..! జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి లోకేష్
2026-05-11 Time: 02:55:06

12-21-39-0539.jpg

ఏపీకి మరో దిగ్గజ సంస్థ.. శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
2026-05-06 Time: 12:21:39

16-17-06-0506.jpg

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు..!రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం చంద్రబాబు
2026-05-05 Time: 04:17:06

12-32-49-0449.jpg

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్.. ఆర్టీజీ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
2026-04-30 Time: 12:32:49

10-50-59-0459.jpg

మీ త్యాగాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను.. టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార ముగింపు సభలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ 
2026-04-30 Time: 10:50:59

Related Videos