ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో వెలువడనున్న క్రమంలో  ఏపీలో అన్ని ప్రధాన పార్టీలు మైండ్ గేమ్ స్టార్ట్ స్టార్ట్ చేశాయి. గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి వైసీపీ, టీడీపీ సిద్దంగా లేవు. పోస్టల్​ బ్యాలట్ల చెల్లుబాటుపై ఇటీవల ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను సవాల్​ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించడానికి శ్రీకారం చుట్టింది. దేశమంతటా ఒక రూల్​ ఉంటే ఇక్కడ మాత్రమే మార్చడమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్​ బ్యాలట్లపై గెజిటెడ్​ ఆఫీసర్​ డిక్లరేషన్​తో సంతకం లేకున్నా చెల్లుబాటు అవుతుందనే అంశంపై వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వైసిపి న్యాయ పోరాటం చేస్తోంది.
ఇదిలా ఉండగా ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఏ పార్టీ కూడా ఓటమిని అంగీకరించదు. తామే గెలుస్తామని ఢంకాబజాయించి మరీ చెప్పడం సాధారణమే. పరాజయాన్ని ముందుగానే ఒప్పుకుంటే పార్టీ శ్రేణులు చెల్లాచెదురైపోతాయనే భయమే ఇందుకు కారణం. కాగా, వైసీపీ అధినేత జగన్​ సొంత సంస్థల ద్వారా సర్వే చేయించుకొని గెలుపు మీద ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఆ పార్టీ నేతలు విశాఖపట్నం ఆంధ్రా విశ్వ విద్యాలయంలో 9న ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సిద్దమవుతున్నారు. పార్టీ విజయంపై ఎలాంటి అనుమానాలు లేవని.. పోలింగ్​ వన్​సైడ్​ జరిగిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. క్యాడర్​ భారీ ఎత్తున విశాఖ తరలి రావాలని కోరుతున్నారు. సీఎంగా జగన్​ రెండోసారి చేసే ప్రమాణస్వీకారం నభూతో.. నభవిష్యత్తు అన్నట్లు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు ఏర్పాట్లకు కసరత్తు చేస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా నుంచి బుధవారం హైదరాబాద్​ చేరుకున్న విషయం తెలిసిందే.  శుక్రవారం పవన్​తోపాటు కూటమి నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. కూటమి పార్టీల్లో ఈపాటికే గెలుస్తున్నామనే ధీమా వచ్చేసింది. అంతటి భారీ పోలింగ్​ నమోదయిందంటే.. అది ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనని కూటమి నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. పోలింగ్​ బూత్​ స్థాయి నుంచి సమాచారం తెప్పించుకున్నారు. మొత్తం లెక్కలేసి కూటమి విజయం తథ్యమంటున్నారు. చంద్రబాబుతో జరిగే సమావేశంలో మంత్రి పదవుల గురించి చర్చించవచ్చని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇలా ఇరుపార్టీలూ  విజయంపై ధీమా వ్యక్తం చేయడంపై కాంగ్రెస్​ సీనియర్​ నేత రఘువీరారెడ్డి స్పందిస్తూ... వైసీపీ లేదా కూటమి గెలిచినా 95 నుంచి 97 స్థానాలు రావొచ్చని అన్నారు. దీన్నిబట్టి విజయం రెండు పక్షాల్లోనూ దోబూచులాడుతున్నట్లు గా అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos