తిరుపతి తొక్కిసలాట ఘటనతో డాకు మహారాజ్ టీం ఓ నిర్ణయం తీసుకుంది. అనంతపురంలో ఇవాళ జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డాకు మహారాజ్ టీం క్యాన్సిల్ చేసుకుంది. ఈ మేరకు డాకు టీం ఓ ప్రకటన విడుదల చేసింది. బాలయ్య  ఈ ఘటన మీద స్పందిస్తూ... తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంఘటన అత్యంత బాధాకరమని అన్నారు. మృతులకు నా నివాళి. వారి కుటుంబ సభ్యులకు నాప్రగాఢ సానుభూతి. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన..డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ జరపడం సముచితం కాదనే ఉద్దేశంతో దానిని రద్దు చేశామని బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. 

కాగా డీఎస్పీ అత్యుత్సాహం వల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ఇలాంటి దుర్ఘటన జరిగి అందరూ బాధల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో... తాము ఈవెంట్ చేసుకోవడం సముచితం కాదంటూ డాకు మహారాజ్ టీం ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసుకుంది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ కోసం నారా లోకేష్ కూడా రావాల్సింది. కానీ తిరుపతిలో దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఈవెంట్‌నే పూర్తిగా రద్దు చేశారు. కాగా రేపటి నుంచి సినీ అభిమానులకు సంక్రాంతి హోరు మొదలైనట్టే. ఈ హోరు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మొదలు పెట్టబోతోంది. జనవరి 10న అంటే రేపే గేమ్ చేంజర్ భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos