ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో వెలువడబోతున్నాయి. మరోవైపు జాతీయ స్ధాయిలో ఈసారి ఎన్డీయే కూటమికి తగినన్ని సీట్లు లభించే అవకాశం లేదని పలువురు సెఫాలజిస్టులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి అధికారం చేపట్టేందుకు అవకాశం లభిస్తే తయారుగా ఉండాలన్న చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై చర్చించేందుకు జూన్ 1న ఇండియా కూటమి పార్టీలు కీలక భేటీ కూడా ఏర్పాటు చేసుకోనున్నాయి.  ఈ నేపథ్యంలో ఏపీలో అధికార వైసీపీతో పాటు విపక్షంలో ఉన్న పార్టీలకు సైతం కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఈసారి గెలవబోయే ఎంపీలకు కీలక ఆఫర్ ఇచ్చారు. వీరంతా ఇండియా  కూటమిలో చేరితే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అన్ని ప్రయోజనాలు సాధించుకోవచ్చని కోరారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఈసారి గెలవబోయే ఎంపీలంతా ఇండియా కూటమిలోకి రావాలని ఆయన కోరారు. అప్పుడు ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని అన్ని హామీలు సాధించుకునేందుకు వీలుంటుందన్నారు. అలాగే తిరుపతిని రాజధానిగా చేయాలని తన పాత డిమాండ్ కూడా తెరపైకి తెచ్చారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు సహా మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయన్నారు. తిరుపతిని రాజధాని చేస్తే సీమకు న్యాయం జరుగుతుందన్నారు. కాబట్టి అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాలన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos