పాకిస్తాన్‌ విషయంలో భారత్ ఏ చిన్న విషయాన్ని లైట్ తీసుకోకుండా గట్టిగా కొట్టాలని డిసైడ్ చేసుకుంది. తాజాగా టెరిటోరియల్ ఆర్మీని కూడా యాక్టివేట్ చేశారు. ఉత్తర, పశ్చిమ , తూర్పు కమాండ్‌లలో మోహరించడానికి, వ్యూహాత్మకంగా బలోపేతం అవడానికి, యుద్దానికి సిద్ధం కావడానికి  టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 14 పదాతిదళ బెటాలియన్‌లను పిలవడానికి  ఆర్మీ చీఫ్‌కు  కేంద్ర ప్రభుత్వం అధికారం ఇచ్చింది. “టెరిటోరియల్ ఆర్మీ రూల్ 1948లోని రూల్ - 33 ద్వారా   అధికారాలను వినియోగించుకోవడానికి,  టెరిటోరియల్ ఆర్మీలో చేరిన ప్రతి అధికారిని , ప్రతి వ్యక్తిని అవసరమైన రక్షణ కోసం పిలవడానికి ఆర్మీ స్టాఫ్ చీఫ్‌కు అధికారం ఉంది” అని ప్రభుత్వం తాజా గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

1917–1920 కాలం నాటి భారత రక్షణ దళం, 1920–1948 నాటి భారత భూభాగ దళంకు తోడు 1948 నాటి టెరిటోరియల్ ఆర్మీ చట్టం ద్వారా  ఈ టెరిటోరియల్ ఆర్మీని ఏర్పాటు చేశారు.   టెరిటోరియల్ ఆర్మీ కి   మూడు నక్షత్రాల ర్యాంక్ డైరెక్టర్ జనరల్ నాయకత్వం వహిస్తారు.   సాధారణంగా భారత సైన్యం నుండి నియమించే  లెఫ్టినెంట్ జనరల్  ర్యాంకింగ్ అధికారి,  రక్షణ మంత్రిత్వ శాఖ   సైనిక వ్యవహారాల విభాగం   చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నేతృత్వం వహిస్తారు. 

టెరిటోరియల్ ఆర్మీ   రెండు యూనిట్లుగా ఉంది.  ప్రభుత్వ రంగ సంస్థలు ,  భారత రైల్వే ,  మాజీ సైనికుల ఉద్యోగులతో కూడిన డిపార్ట్‌మెంటల్ యూనిట్ . అలాగే ప్రైవేట్‌గా పనిచేసే పౌరులతో కూడిన నాన్-డిపార్ట్‌మెంటల్ యూనిట్.  1962 నాటి చైనా-భారత యుద్ధం , 1965 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం , 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం మరియు కార్గిల్ యుద్ధంతో సహా దేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి భారతదేశం జరిగిన అన్ని యుద్ధాలలో టెరిటోరియల్ ఆర్మీ  పాల్గొందని ఉన్నతాధికారులు గుర్తు చేస్తున్నారు.

Related Videos