ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాకిస్తాన్ లోని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్l లోని ఉగ్ర స్థావరాల పైన దాడులు చేసి వాటిని సమూలంగా నాశనం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ భారత్ పైన ఎదురు దాడులకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతోంది. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ముదురుతున్న వేళ... ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎటువంటి ప్రభావం ఉంటుందన్న ఆందోళన ప్రజలలో కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ రెండు టార్గెట్ అవుతాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే గనక జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల పైన యుద్ధం ప్రభావం ఉంటుందని మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ విషయం పైన సీబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. దేశంలోని సరిహద్దు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలలోని ప్రజలకు హాని కలగాలంటే పాక్ యుద్ధ విమానాలు మన గగనతలంలోకి ప్రవేశించాలని, అయితే అది సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. మన సరిహద్దు రక్షణ వ్యవస్థ అత్యంత బలంగా ఉందని ఆయన వెల్లడించారు. పాక్ యుద్ధ విమానాలను పసిగట్టి వాటిని మన గగనతలం లోకి రాకుండానే పేల్చి వేసే వ్యవస్థ భారతదేశానికి ఉందని ఆయన అన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల దాకా వచ్చే అవకాశం లేదని మాజీ జేడీ తేల్చి చెప్పారు .ఇక చాలామంది యుద్ధం వస్తుంది, సరుకులు నిల్వ చేసుకోవాలని చెబుతున్నారని, అయితే అంత అవసరం లేదని ఆయన సూచించారు. ఇది కేవలం మార్కెట్ పెంచుకోవడానికి జరిగే కుట్ర మాత్రమేనని ఆయన వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలలోనూ, సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ చానల్స్ లోను వచ్చే వార్తలను నమ్మవద్దని, యుద్ధ సమయంలో ప్రభుత్వం అధికారికంగా చేసే ప్రకటనలను మాత్రమే నమ్మాలని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ తో మనకు యుద్ధం జరిగినా తెలుగు రాష్ట్రాలకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు యుద్ధం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos