ప్రతి విషయంలోనూ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకునే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి... ఇప్పుడు కూడా ఎలాంటి వివేకాన్ని ప్రదర్శించకుండా ఆత్రపడి మళ్లీ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో సుమారు 6 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో వైసీపీని తిరస్కరించిన ప్రజలు... ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చి జగన్ కు బుద్ధి చెప్పారు.    గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనకు నెగిటివ్ గా తీర్పు ఇచ్చి కూటమి పార్టీలకు 164 సీట్లలో గెలుపును  కట్టబెట్టారు. ఎన్నికల్లో దారుణ ఓటమిని అవమానంగా భావించిన జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా బహిష్కరించి... ఇప్పుడు   తగుదునమ్మ అంటూ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద రైతులు... ధర్నాలు, ఆందోళనలు చేయాలని, అదేవిధంగా విద్యుత్ చార్జీల పైన ఈ నెల 27న ఆందోళన చేపట్టాలని ప్రజలకు, జనవరి 3వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళనలు చేపట్టాలని విద్యార్థులకు వైసీపీ అధినేత జగన్ పిలుపునివ్వడాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని భావించవచ్చు. కానీ  వచ్చే సంక్రాంతి తర్వాత జగన్ 26 జిల్లాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకోవడమే ఆశ్చర్యంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్ని చుట్టేయబోతున్నారని, వారానికి రెండు రోజుల పాటు ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ అక్కడే బస చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. 

సుమారు ఆరు నెలల కిందటే ఎన్నికల ఫలితాల్లో ప్రజాభిప్రాయం ఏమిటో తెలిసినా .. మళ్లీ ఇప్పుడు ఎందుకు జనాల్లోకి వెళ్లాలనుకుంటున్నారంటే ... జగన్ కు జమిలీ ఎన్నికల భయం పట్టుకుందని పరిశీలకులు అంటున్నారు. అందుకే జగన్ ప్రతి సమావేశంలోనూ పార్టీ నేతలకు  .. ఎన్నికలకు సిద్ధం కావాల్సిన తరుణం వచ్చేసిందని  పదే పదే చెప్తున్నారు. దీంతో జగన్ జిల్లాల టూర్ ఆసక్తి రేపుతోందని అంటున్నారు. ఆరునెలల కిందటే  తమ తీర్పు స్పష్టంగా చెప్పేసిన ప్రజలు... జగన్ ను ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న చర్చ కూడా మొదలైంది. ఇంతకీ జగన్ ఇంత త్వరగా జనంలోకి వెళ్లాలని ఎందుకు నిర్ణయించుకున్నారని దానిపై చర్చ జరుగుతోంది.

మరోవైపు కేంద్రంలోని ఎన్డీయేతో పాటు విపక్ష ఇండియా కూటమిని కూడా జనం దాదాపు సమానంగానే ఆదరిస్తున్నారు.ఈ నేపథ్యంలో పరిస్ధితి చేజారకముందే ప్రధాని మోదీ జమిలికి వెళ్లిపోతే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతోనే జగన్ ఇలా ముందస్తుగా జనంలోకి వెళ్లిపోతున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటి నుంచి ప్రతిరోజూ ప్రజల్లోనే ఉంటూ వరుసగా ఆందోళనలు చేపడుతూ ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టడం ప్రారంభిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయన్న ఆలోచనతోనే  జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : పెన్షన్ల పంపిణీ..CM Chandrababu Pension Distribution @ Palnadu | NTR Bharosa | Amaravati Gala

తాజా వార్తలు

19-43-09-0109.jpg

స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ కు గుంటూరు, ప్రకాశం జిల్లాలు అనుకూలం.. ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గోంట్కోవికోవాతో లోకేష్ భేటీ
2025-01-21 Time: 07:43:09

17-55-03-0103.jpg

ఏపీలో జడ్ఎఫ్ ఫాక్స్ కాన్ వాహన తయారీ యూనిట్ నెలకొల్పండి..! సిఇఓ ఐకీ డోర్ఫ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
2025-01-21 Time: 05:55:03

17-52-33-0133.jpg

ఇక ఆ విషయంపై మాట్లాడొద్దు - జనసేన శ్రేణులకు హైకమాండ్ కీలక ఆదేశాలు..!
2025-01-21 Time: 05:52:33

16-43-36-0136.jpg

దావోస్ లో సిస్కో వైస్ చైర్మన్ ప్రాన్సిస్ కట్సౌదాస్ తో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి..!
2025-01-21 Time: 04:43:36

16-41-00-0100.jpg

ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయండి..! మాస్టర్ కార్డ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజమన్నార్ తో మంత్రి లోకేష్ భేటీ
2025-01-21 Time: 04:41:00

Related Videos