లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. వరుసగా బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరిన 24 గంటల్లోనే మరో ఎంపీ కాషాయం కండువా కప్పుకున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి  బీజేపీ కండువా కప్పుకున్నారు. పాటిల్ కొంత కాలంగా బీజీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తనకు జహీరాబాద్ సీటు ఇవ్వాలని..అందుకు అంగీకరిస్తే పార్టీ మారేందుకు సిద్దమని చెప్పినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. బీబీ పాటిల్ వరుసగా 2014, 2019 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తరువాత ఆయనతో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. తాజాగా ఎంపీ రాములు బీజేపీలో చేరిన తరువాత పాటిల్ కు సీటు పైన హామీ దక్కినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఆయన పార్టీలో చేరారు..స్థానిక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుండగా... ఎంపీలు బీజేపీ బాట పట్టారు. దీంతో, వచ్చే లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ నాయకత్వానికి పరీక్షగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా 400 సీట్లు గెలవటం పైన గురి పెట్టిన బీజేపీ ఇతర పార్టీల నుంచి వచ్చే  ఎంపీలకు ఛాన్స్ ఇస్తోంది. తెలంగాణలోనూ ఆపరేషన్  కొనసాగిస్తున్న క్రమంలో నేతల చేరికల ప్రక్రియ వేగం పుంజుకుందని విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos