రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు గుడ్ న్యూస్. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కౌలుకు సంబంధించిన బిల్లుల వ్యవహారం సీఎఫ్‌ఎంఎస్‌ దగ్గర పెండింగ్‌లో ఉందని సీఆర్‌డీఏ తరఫు లాయర్ హైకోర్టుకు తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పురోగతిపై వివరాలు సమర్పించాలని సీఆర్‌డీఏను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. రైతులకు కౌలు చెల్లింపునకు సంబంధించి జాప్యం జరుగుతుండటంతో దీన్ని సవాల్ చేస్తూ మంగళగిరికి చెందిన రైతు పోతినేని శ్రీనివాసరావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రూ. 200 కోట్ల విడుదలకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని... త్వరలో సొమ్ము జమ అవుతుందని కూడా ప్రభుత్వం చెప్పిందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. రైతులకు ఏటా మే 31లోపు వార్షిక కౌలు జమ చేయాల్సిన చట్టబద్ధ బాధ్యత ప్రభుత్వం, సీఆర్‌డీఏపై ఉందని... అయినా కౌలును చెల్లించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్‌ తరఫు లాయర్ ఈ మేరకు వాదనలు వినిపించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది తన వాదన వినిపిస్తూ... కౌలు డబ్బులు రూ.200 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని, రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని అన్నారు. సో... అమరావతి రైతులకు ఇది శుభవార్త అన్నమాట.

యూట్యూబ్ లైవ్

LIVE : పెన్షన్ల పంపిణీ..CM Chandrababu Pension Distribution @ Palnadu | NTR Bharosa | Amaravati Gala

తాజా వార్తలు

19-43-09-0109.jpg

స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ కు గుంటూరు, ప్రకాశం జిల్లాలు అనుకూలం.. ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గోంట్కోవికోవాతో లోకేష్ భేటీ
2025-01-21 Time: 07:43:09

17-55-03-0103.jpg

ఏపీలో జడ్ఎఫ్ ఫాక్స్ కాన్ వాహన తయారీ యూనిట్ నెలకొల్పండి..! సిఇఓ ఐకీ డోర్ఫ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
2025-01-21 Time: 05:55:03

17-52-33-0133.jpg

ఇక ఆ విషయంపై మాట్లాడొద్దు - జనసేన శ్రేణులకు హైకమాండ్ కీలక ఆదేశాలు..!
2025-01-21 Time: 05:52:33

16-43-36-0136.jpg

దావోస్ లో సిస్కో వైస్ చైర్మన్ ప్రాన్సిస్ కట్సౌదాస్ తో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి..!
2025-01-21 Time: 04:43:36

16-41-00-0100.jpg

ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయండి..! మాస్టర్ కార్డ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజమన్నార్ తో మంత్రి లోకేష్ భేటీ
2025-01-21 Time: 04:41:00

Related Videos