పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుండే కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం విజయవాడలోని కృష్ణలంక ఐస్ ఫాక్టరీ వద్ద కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి టీడీపీ నాయకుడు కేశినేని చిన్ని ప్రారంభించారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అందరూ నివాళులర్పించారు. అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది ఎన్టీఆర్ ఆశయమని... చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు కేశినేని ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. పేద ప్రజలకు అవసరసమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ... మేం కేవలం వైద్య పరీక్షలు చేయడం మాత్రమే కాదని.. వారికి అవసరమైన మందులు కూడా పంపిణీ చేస్తున్నామని కేశినేని చిన్ని అన్నారు. బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షలు చేసి, అవసరమైనవారికి వైద్యం కూడా అందిస్తామని చెప్పారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు పార్టీలకతీతంగా కొనసాగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. కాగా... మెడికల్ క్యాంపునకు పెద్దఎత్తున పేదప్రజలు తరలివస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కేశినేని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందించింది. కాగా.. ఇప్పుడు చేపట్టిన మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. వేల సంఖ్యలో రోగులకు నిష్ణాతులైన వైద్యులు వైద్య చికిత్సలు అందించారు. అలాగే అవసరమైన రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి ఆరోగ్య అన్న క్యాంటీన్ ద్వారా ఉచిత భోజన సదుపాయాన్ని కూడా కల్పించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos