ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుభవ లేమితో... అగ్నానంతో విధిస్తున్న పన్నుల భారం మోయలేక సాధారణ, మధ్యతరగతి కుటుంబాల వారు అవస్థల పాలు అవుతున్నారు. జగన్... భారీగా పెంచిన ఆస్తిపన్నుకు తోడు ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలకు ఇవి మోయలేని భారంగా తయారయ్యాయి.  ప్రజలపై భారం పడకుండా ఘన వ్యర్థాల నిర్వహణలో అనేక రాష్ట్రాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయి. కానీ... జగన్ ప్రభుత్వం అలాంటి దారుల్ని చూడకుండా పన్నులు వేస్తూ... ప్రజలను ఆర్థికంగా ఇరుకున పెడుతోంది. ఇళ్ల నుంచి చెత్త సేకరణకు వినియోగ రుసుముల వసూళ్లపై సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఎంత వ్యతిరేకించినా వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది జగన్ సర్కారు. రుసుములు చెల్లించలేని పేదలను వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని బెదిరిస్తున్నారు. దుకాణాల ముందు చెత్త వేసి వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చెత్త సేకరిస్తున్నందుకు ప్రజల నుంచి రూ.30 నుంచి 120 వరకు, వ్యాపారుల నుంచి రూ.60 నుంచి కేటగిరినీ బట్టి రూ.5 వేల వరకు రుసుములు వసూలు చేస్తున్నారు అధికారులు. ఈ విధంగా ప్రజలు, వ్యాపారులపై ప్రభుత్వం ఏటా రూ.165 కోట్ల భారం వేస్తోంది. ఒక ప్రైవేటు సంస్థకు ఆర్థికంగా మేలు చేకూర్చేందుకే ప్రభుత్వం ఇళ్ల నుంచి చెత్త సేకరించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థ ద్వారా తొలి విడతగా 42 పుర, నగరపాలక సంస్థలకు 2,146 ఆటోలు పంపిణీ చేయించారు. ఇందుకోసం ఒక్కో ఆటోకి నెలకు రూ.62 వేల చొప్పున మొత్తం రూ.13.3 కోట్లు స్థానిక సంస్థలు చెల్లించాలన్నది ఒప్పందం. ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేసినా చేయకపోయినా... ప్రైవేటు సంస్థకు ప్రతి నెలా డబ్బు చెల్లించాల్సిందే. పైనుంచి అధికారులు సచివాలయాల ఉద్యోగులకు లక్ష్యాలు విధించడంతో వాలంటీర్ల ద్వారా ప్రజలను, చిరు వ్యాపారులను భయపెట్టి వినియోగ రుసుములు చెల్లించాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పలువురు వృద్ధులకు ఇచ్చే పింఛన్ నుంచి వినియోగ రుసుముల బకాయిలను సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు మినహాయించారు. కడప కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు ఇచ్చే పింఛన్ల నుంచి వినియోగ రుసుములు మినహాయించి వారిని ఇబ్బంది పెట్టొద్దని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అధికారులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. గడువులోగా రుసుములు వసూలు చేయనందుకు కాకినాడలో ముగ్గురు కార్యదర్యులను సస్పెండ్ చేయడం దుమారం రేపింది. జగన్ ప్రభుత్వం 2021 అక్టోబరు 2న స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ – క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి విడతగా ప్రారంభించిన 42 నగరాలు, పట్టణాలకు తోడు ఈ జూన్ లో మరో 36 పట్టణ స్థానిక సంస్థల్లోనూ చెత్త సేకర ణకు ఈ-ఆటోలు ప్రారంభించారు. చెత్త సేకరణపై ఇళ్ల నుంచి వినియోగ రుసుముల వసూళ్లను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడప నగరపాలక సంస్థలో రుసుముల వసూళ్లపై వైసీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్డ్డి ఏడాది క్రితమే అభ్యంతరం చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఓల్డ్ పీఅండ్ టీ కాలనీ వాసులు మొదట నుంచీ చెత్త పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విధంగా చెత్తపైన సైతం పన్ను వసూలు చేస్తుంటంతో... ఇలాంటి జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ మేం ఎన్నుకోవాలా... మళ్లీ మేం ఇబ్బందుల్లో కూరుకుపోవాలా అని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు అధికారులను, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

14-55-06-0506.jpg

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్..! జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి లోకేష్
2026-05-11 Time: 02:55:06

12-21-39-0539.jpg

ఏపీకి మరో దిగ్గజ సంస్థ.. శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
2026-05-06 Time: 12:21:39

16-17-06-0506.jpg

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు..!రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం చంద్రబాబు
2026-05-05 Time: 04:17:06

12-32-49-0449.jpg

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్.. ఆర్టీజీ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
2026-04-30 Time: 12:32:49

10-50-59-0459.jpg

మీ త్యాగాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను.. టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార ముగింపు సభలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ 
2026-04-30 Time: 10:50:59

Related Videos