నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం అఖండ 2: తాండవం విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించింది. ఈ సినిమా ప్రీమియర్ షోల ప్రదర్శనకు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌లకు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ తమ అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్) ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. "డిసెంబర్ 11న ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు జీవో జారీ చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సకాలంలో లభించిన మద్దతు, మా చిత్రాన్ని ప్రేక్షకులకు అద్భుతంగా అందించడానికి ఎంతో దోహదపడుతుందని" పేర్కొంది. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల‌ 5న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని ఆర్థిక కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే యూ/ఏ సర్టిఫికేట్‌తో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి త‌మన్ సంగీతం అందించారు. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గాను, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లోను నటించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos