నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం అఖండ 2: తాండవం విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించింది. ఈ సినిమా ప్రీమియర్ షోల ప్రదర్శనకు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లకు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. "డిసెంబర్ 11న ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు జీవో జారీ చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సకాలంలో లభించిన మద్దతు, మా చిత్రాన్ని ప్రేక్షకులకు అద్భుతంగా అందించడానికి ఎంతో దోహదపడుతుందని" పేర్కొంది. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 5న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని ఆర్థిక కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే యూ/ఏ సర్టిఫికేట్తో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్గాను, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లోను నటించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos