ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు ఊరట దక్కింది. నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని ఆదేశించింది. ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాల వైెఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్‌ వెళ్లారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా నంద్యాలలోకి ఆయన్ను తీసుకువచ్చారు. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులు లేవు. అయినా సరే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉండగా.. అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్‌పై శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిలపై అప్పట్లో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసును క్వాష్ చేయాలంటూ అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిష‌న్ గ‌త నెల 25న విచరణ‌ జరిగింది.. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవద్దని హైకోర్టు పోలీసుల‌ను ఆదేశించింది. ఈ కేసుపై బుధవారం అంటే ఇవాళ తుది తీర్పు ఇస్తామని ప్ర‌క‌టించి... ఈ మేరకు అల్లు అర్జున్‌పై కేసును క్వాష్ చేస్తూ తీర్పును వెల్లడించింది.

మరోవైపు అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పురోహితులు వేదాశీర్వచనం అందించారు. అలాగే శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి.. పట్టువస్త్రంతో సత్కరించారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే తిరుమలకు రాలేదు.. స్నేహారెడ్డి తన స్నేహితులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా.. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప2 ది రూల్‌’‌‌లో రష్మిక హీరోయిన్. ఈ మూవీ డిసెంబరు 5న పాన్‌ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి అల్లు అర్జున్ నంద్యాల కేసు నుంచి బయటపడటంతో ఆయన అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos