టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు- మంచు మనోజ్ మధ్య హాస్టల్ వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో మోహన్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆస్తుల వ్యవహారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది.

హైదరాబాద్ శివారు జల్‌పల్లి నివాసాన్ని తనకు స్వాధీనం చేయాలని మోహన్ బాబు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన నివాసంలో కొందరు అక్రమంగా ఉంటున్నారని.. వెంటనే ఖాళీ చేయించాలన్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రచారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని ఫిర్యాదులో కోరారు. ప్రస్తుతం జల్‌పల్లిలోని నివాసంలో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి, తన పిల్లలతో ఉంటున్నట్లు తెలిసింది. మంచు మనోజ్ ఫిర్యాదుపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ మేరకు మంచు మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు.

మనోజ్ జల్లపల్లిలోని నివాసంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఆస్తిని స్వాధీనం చేసి ఇవ్వాలని.. మోహన్ బాబు కలెక్టర్‌ను ఆశ్రయించారు. దీంతో కలెక్టర్ మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. ఆస్తుల స్వాధీనానికి పోలీసులను ఆదేశించారు.ఇదిలా ఉండగా.. మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు.  మహిళలు, నాన్న, స్టాఫ్‌ను పక్కన పెట్టి మనం కలుద్దాం. ఒట్టేసి చెబుతున్నా.. నేనొక్కడినే వస్తా. నువ్వు ఎవరినైనా, ఎంతమందినైనా తీసుకొచ్చుకో. లేకపోతే మనం హెల్తీ ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం' అని మనోజ్ ట్వీట్ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos