తిరుపతి తొక్కిసలాట ఘటనతో డాకు మహారాజ్ టీం ఓ నిర్ణయం తీసుకుంది. అనంతపురంలో ఇవాళ జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డాకు మహారాజ్ టీం క్యాన్సిల్ చేసుకుంది. ఈ మేరకు డాకు టీం ఓ ప్రకటన విడుదల చేసింది. బాలయ్య  ఈ ఘటన మీద స్పందిస్తూ... తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంఘటన అత్యంత బాధాకరమని అన్నారు. మృతులకు నా నివాళి. వారి కుటుంబ సభ్యులకు నాప్రగాఢ సానుభూతి. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన..డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ జరపడం సముచితం కాదనే ఉద్దేశంతో దానిని రద్దు చేశామని బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. 

కాగా డీఎస్పీ అత్యుత్సాహం వల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ఇలాంటి దుర్ఘటన జరిగి అందరూ బాధల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో... తాము ఈవెంట్ చేసుకోవడం సముచితం కాదంటూ డాకు మహారాజ్ టీం ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసుకుంది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ కోసం నారా లోకేష్ కూడా రావాల్సింది. కానీ తిరుపతిలో దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఈవెంట్‌నే పూర్తిగా రద్దు చేశారు. కాగా రేపటి నుంచి సినీ అభిమానులకు సంక్రాంతి హోరు మొదలైనట్టే. ఈ హోరు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మొదలు పెట్టబోతోంది. జనవరి 10న అంటే రేపే గేమ్ చేంజర్ భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos