టాలీవుడ్ కథానాయకుడు రవితేజ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి, భూపతిరాజు రాజగోపాల్ రాజు (90), హైదరాబాద్‌లోని తన నివాసంలో నిన్న రాత్రి అంటే జులై 15న రాత్రి కన్నుమూశారు. రాజగోపాల్ రాజు గారు తమ స్వగ్రామం ఏపీలోని జగ్గంపేట కాగా, వృత్తిరీత్యా ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. ఆయనకు రవితేజతో పాటు రఘు, భరత్ రాజు అనే కుమారులున్నారు. దురదృష్టవశాత్తు భరత్ రాజు 2017లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. రవితేజ తండ్రిగా విశేషమైన స్టార్‌డమ్ ఉన్నప్పటికీ, రాజగోపాల్ రాజు హైదరాబాద్‌లో చాలా సాధారణ జీవితాన్ని గడిపారు. ఆయన, ఆయన సతీమణి బహిరంగంగా కనిపించడం చాలా అరుదు.

గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి ఆయన కనుమూశారు. రాజగోపాల్ రాజు మరణవార్త తెలుసుకున్న రవితేజ అభిమానులు, అనుచరులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. రవితేజ తండ్రి మరణంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.రవితేజ తండ్రి రాజ గోపాల్ రాజు మరణించారని విని నేను చాలా బాధపడ్డాను. నేను చివరిసారిగా వాల్తేరు వీరయ్య సెట్స్‌లో ఆయనను కలిశాను. ఈ క్లిష్ట సమయంలో, ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు. రాజగోపాల్ రాజు పార్ధీవదేహం ప్రస్తుతం రవితేజ నివాసంలో సందర్శనార్థం ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం తరువాత రాయదుర్గం మహాప్రస్థానం స్మశాన వాటికలో రాజగోపాల్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా, రవితేజ ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'మాస్ జాతర' విడుదల కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ఆగస్టు 27న థియేటర్లలోకి రానుంది. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, తండ్రి మరణంతో రవితేజ తన కర్మకాండలను నిర్వహించడానికి కొంతకాలం షూటింగ్‌ల నుండి విరామం తీసుకోనున్నారని చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos