థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రీసెంట్‌గా ఎక్స్‌లో ఖాతా ఓపెన్ చేసి.. తన ప్రత్యర్థులపై సెటైర్లతో పోస్టులు పెడుతున్నారు. వేదికలపై మాట్లాడితే బాయ్‌కాట్ అంటున్న వారంతా తన భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని ఇకపై ఎక్స్‌లో స్పందిస్తానని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఓ పార్టీని టార్గెట్ చేసుకొని పోస్టులు పెడుతున్నారు.

ఇవాళ కూడా తాజాగా వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఓ పోస్టు పెట్టారు పృథ్వీ. అందులో 11 అనే అంకె ఉన్న ఫొటోయాడ్ చేశారు. 11 సార్లు నీరు తాగండి అసలే ఎండాకాలం, ఉష్ణోగ్రతలు 151 డిగ్రీల ఫారెన్ హీట్ టచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్ అంటూ పోస్టు చేశారు. కొసమెరుపుగా ఆరోగ్య చిట్కాలు నా తోటి సోదరుల కోసం అంటూ రాసుకొచ్చారు.

మొన్నీ మధ్య లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 11 గొర్రెలు, మేకల స్టోరీ చెప్పారు. తమపైనే సెటైర్లు వేస్తున్నారంటూ వైసీపీ నేతలంతా ఫైర్ అయ్యారు. ఏకంగా లైలా సినిమా బాయ్‌కాట్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ప్రమాదాన్ని గుర్తించిన లైలా సినిమా హీరో విశ్వక్‌ సేన్ స్పందించి క్షమాపణలు చెప్పారు. దీనిపై పృథ్వీ కూడా స్పందించి సారీ చెప్పారు. 

దాన్ని మనసులో పెట్టుకున్న పృథ్వీ సోషల్ మీడియాలో ఇన్‌డైరెక్ట్‌గా వైసీపీని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు పెట్టిన 11 గ్లాస్‌ల నీరు సలహా కూడా వారిని ఉద్దేశించిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2022 వరకు కమెడియన్ పృథ్వీ వైఎస్‌ఆర్‌సీపీలోనే కొనసాగారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్‌వీబీసీ ఛానల్‌ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. అయితే ఆయన ఓ వివాదంలో ఇరుక్కోవడంతో పదవి పోయింది. ఇందులో తన తప్పేమీ లేదని కావాలనే పార్టీలోని కొందరు వ్యక్తులు, ఓ వర్గం నాయకులు తనను టార్గెట్ చేశారని చెప్పుకున్నారు పృథ్వీ.

ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఆయనకు గుర్తింపు లేకపోవడంతో బయటకు వచ్చేశారు. వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జనసేనకు మద్దతుగా మాట్లాడుతూ వచ్చారు. వైసీపీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత పృథ్వీకి మరింత బలం వచ్చింది. వైసీపీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లే రావడంతో దానిపై తరచూ మాట్లాడుతున్నారు.

సినిమా వేదికలపై మాట్లాడుతుంటే నిర్మాతలను సినిమా ఇండస్ట్రీని, సినిమాను టార్గెట్ చేస్తున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో దూకుడు పెంచారు. అందుకే జనవరిలో ఎక్స్‌ ఖాతా తెరిచారు. అందులో తనను తాను పరిచయం చేసుకుంటూ తాను అధికారికంగా ఎక్స్‌లో ఖాతా తెరిచినట్టు చెప్పుకున్నారు. "నేను నా భావాలను స్టేజ్ పైన ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు నుంచి ఈ X ఆనే వేదిక ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్చ తెలియపరుస్తాను." అంటూ పోస్టు చేశారు. అప్పటి నుంచి ఏదోలా ఆ పార్టీని టార్గెట్ చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. దీనిపైన వైసీపీ సోషల్ మీడియా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos