మోహన్బాబు కుటుంబ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తున్న వార్తలపై ఆమె శనివారం స్పష్టతనిచ్చారు. మంచు విష్ణు తన ఇంట్లోకి వచ్చి జనరేటర్లో చక్కర పోశాడని మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన విషయమై ఆమె మాట్లాడారు. ఆ కంప్లైంట్, ఆ ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, అవన్నీ ఆరోపణలే అని మనోజ్ తల్లి, మోహన్ బాబు భార్య అయిన నిర్మలా దేవీ క్లారిటీ ఇచ్చారు. దీంతో మనోజ్ బండారాన్ని స్వయంగా కన్నతల్లి బయట పెట్టిన్నట్టయింది. . ప్రస్తుతం నిర్మలా దేవీ పేరు మీదున్న ప్రెస్ నోట్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ మేరకు ఆమె పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు తెలిపినట్టుగా అందులో ఉంది.
'డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడని.. అయితే ఈ విషయంపై మంచు మనోజ్.. విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడని నిర్మల దేవి ఫిర్యాదులో పేర్కొన్నారు. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదని... ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఈ ఇంటిపై మనోజ్కు ఎంత హక్కు ఉందో.. పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉందని. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదని.. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదని నిర్మలా దేవి ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా 'మేమిక్కడ పనిచేయలేమంటూ వాళ్లే మానేశారని... ఇందులో విష్ణు ప్రమేయం లేదని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు.
కాగా నిర్మలా దేవీ చెప్పిన దాని ప్రకారం.. జనరేటర్లో షుగర్ వేశాడనేది కేవలం డ్రామా అని అర్థం అవుతోంది. దీంతో మనోజ్ అసలు ఏం చేస్తున్నాడు.. మంచు కుటుంబంలో ఈ అంతర్గత కుమ్ములాట ఏంటి.. అసలు వారి ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. అరేయ్ ఏంట్రా ఇది అంటూ మంచు మనోజ్ గురించి నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారంతా.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos