నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా, వసూళ్లలో సునామీ సృష్టిస్తూ వెయ్యి కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం అంచనాలను మించి అద్భుతమైన విజయం సాధించింది.  అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన 'కాంతార చాప్టర్ 1', మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. తాజాగా చిత్ర బృందం వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం, ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 818 కోట్లు వసూలు చేసింది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతూ రూ, 1,000 కోట్ల దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన, దర్శకత్వ ప్రతిభకు విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కథానాయికగా రుక్మిణి వసంత్ తన నటనతో ఆకట్టుకోగా, కీలక పాత్రల్లో మలయాళ నటుడు జయరామ్, బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య తమ నటనతో సినిమా స్థాయిని పెంచారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తెలుగు వెర్షన్ ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణ నేపథ్యంలో, ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ భాషలోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 31న 'కాంతార చాప్టర్ 1' ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ అసాధారణ విజయం తర్వాత రిషబ్ శెట్టి తదుపరి ప్రాజెక్టులపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos