మన శంకర వరప్రసాద్‌ గారు సంక్రాంతి పండక్కి వచ్చేశారు.. ప్రీమియర్స్ తోనే థియేటర్లలో పండగ వాతావరణం తీసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆదివారం రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వింటేజ్‌ బాస్ ను చూశామంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రెస్పాన్స్ చూసి చిరు సైతం ఖుషీగా ఉన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రాత్రి 'మన శంకర వరప్రసాద్‌ గారు' సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. వీటికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రీమియర్స్‌ పూర్తవ్వగానే అర్ధరాత్రి చిత్ర బృందం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుంది. శ్రీరాములు థియేటర్ లో షో చూసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. నిర్మాత సాహు గారపాటితో కలిసి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరు, అనిల్‌ రావిపూడి, సాహు, సుస్మిత కొణిదెల కలిసి ఒకరికొకరు స్వీట్స్‌ తినిపించుకున్నారు.

'మన శంకర వరప్రసాద్‌ గారు' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఫోటోలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో చిరంజీవి - అనిల్ రావిపూడి ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మొత్తానికి కామెడీ  ప్రధానంగా సరదాగా సందడి చేసే కంటెంట్ తో కూడిన సినిమా ఇది. సంక్రాంతికి ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని సినిమా విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos