వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది. న్యాయస్థానంలో ఆయనకు బెయిల్ లభించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా కోర్టు కొద్దిసేపటి కిందటే బెయిల్ మంజూరు చేసింది. అంబటి రాంబాబును తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా సెషన్స్ న్యాయస్థానం జడ్జి కొట్టివేశారు. ఈ కేసులో కస్టడీ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో అక్రమంగా లక్కీ డ్రా నిర్వహించారనే ఆరోపణలతో అంబటి రాంబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి సంబరాల పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆయనపై కేసు నమోదైంది. అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇటీవలే విచారణ నిమిత్తం గుంటూరు న్యాయస్థానానికి హాజరయ్యారు. ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై విచారణ చేపట్టింది గుంటూరు కోర్టు. ఇరు పక్షాల వాదోపవాదాలను ఆలకించిన తర్వాత విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు మళ్లీ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపింది. లక్కీ డ్రా కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉందని, ఈ దశలో అంబటి రాంబాబుకు బెయిల్ ఇవ్వడం వల్ల తన పలుకుబడిని ఉపయోగించి దర్యాప్తును ప్రభావితం చేయవచ్చని పోలీసుల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. ఈ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కస్టడీకి ఇవ్వాలంటూ ఇచ్చిన పిటిషన్ ను కొట్టివేసి.. అంబటికి బెయిల్ ఇచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos