ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) షెడ్యూల్‌ విడుదలైంది. టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. డిసెంబరు 10 నుంచి పరీక్షలు నిర్వహిస్తుండగా.. జనవరి 19న ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అక్టోబరు 24 నుంచి అంటే ఈ రోజు నుంచి నవంబరు 23 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఇక.. డిసెంబరు 10 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబరు 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. జనవరి 19న ఫలితాలు విడుదల చేయనున్నారు.  ఈసారి టెట్‌లో ప్రధానంగా రెండు కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీ మార్కుల్లో 5 శాతం సడలింపు ఇస్తున్నారు. ఇకపై పూర్తిగా ఎన్‌సీటీఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. 2011 నుంచి టెట్‌ అమల్లోకి వచ్చింది.

ఇక..స్కూల్‌ అసిస్టెంట్‌కు సంబంధించిన 2ఏ, 2బీ పేపర్లు టెట్‌ రాసే అభ్యర్థులకు డిగ్రీలో 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45శాతం మార్కులు ఉండాలి. 2011 కంటే ముందు ఉద్యోగాలు పొందిన టీచర్లు కచ్చితంగా టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు ఇన్‌-సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రాసే అవకాశాన్ని పాఠశాల విద్యాశాఖ కల్పించింది. అయితే ప్రభుత్వ మేనేజ్‌ మెంట్ల టీచర్లకు, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని టీచర్లకు ఇంటర్మీడియట్‌, డిగ్రీలో కనీస మార్కుల నిబంధన వర్తించదు. ఇక 2011 జూలై 29 కంటే ముందు బీఈడీ లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో అడ్మిషన్‌ పొంది ఉంటే వారికి అర్హత మార్కుల శాతంతో సంబంధం లేదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

అదేవిధంగా 2011కు ముందు కోర్సులు పూర్తిచేసిన వారికి సంబంధిత అర్హత కోర్సు (డిగ్రీ, ఇంటర్‌)లో ఓసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40శాతం మార్కులు ఉండాలి. టెట్‌ నిర్వహణకు పాఠశాల విద్య కమిషనర్‌ నేతృత్వంలో కమిటీని నియమించింది. పరీక్ష ను 150 ప్రశ్నలతో 150 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్‌తో పాటు ఎంపిక చేసుకున్న భాషలో ఉంటుంది. టెట్‌లో ఉత్తీర్ణతకు ఓసీలకు 60శాతం, బీసీలకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 40 శాతం మార్కులు రావాలి. టెట్‌ సర్టిఫికెట్‌కు జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. టీఆర్‌టీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఇస్తారని సంబంధిత అధికారులు వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos