మాజీ మంత్రి జోగి రమేష్ పైన మరో కేసు రిజిస్టర్ అయింది. మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా జోగి రమేశ్‌ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు రమేశ్‌పై పలు సెక్షన్ల కింద ఇబ్రహీంపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులోనూ పలు సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఇక జోగి నివాసంపై దాడిని పరిశీలించేందుకు వెళ్తుండగా జరిగిన అరెస్టులపై సైతం కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ మస్తాన్, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేశారు. కాగా, జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సుమోటోగా తీసుకుని ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి కేసు నమోదు చేశారు. జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులో టీడీపీ కార్యకర్తలు కాకి నాగరాజు, గణపతి, మేసిపాము బాబూరావుల పేర్లు నమోదయ్యాయి.

కాగా, దాడి సమయంలో తిరుపతిలో ఉన్న జోగి రమేష్ అక్కడి నుంచి తిరిగి నివాసానికి చేరుకున్న తర్వాత వైసీపీ నేత మొండితోక జగన్మోహన రావు ఆయన్ను కలిసారు.   జగన్మోహన రావుతో అర్ద్రరాత్రి 1.30 గంటలకు సమావేశం అయ్యారు. జోగి రమేష్ ప్రస్తుతం తన నివాసంలోనే పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఇదే సమయంలో జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందో బస్తు ఏర్పాటు చేసారు. అటు జోగి రమేష్ ఇంటి పైన దాడి జరగటంతో మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. దాడుల పైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos