ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఇవాళ  గురువారం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించబోతున్నారు. సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, కృష్ణా నది తీరంలో మెరినా వాటర్‌ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపుకు, రాజధానిలో గతంలో కేటాయించిన 112 ఫ్లాట్లలో మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది.

అయితే, ఎస్‌ఐపీబీలో (SIPB) ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తం 14 సంస్థలకు చెందిన రూ. 19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రిమండలి ఆమోదం ఇవ్వనుంది. అదేవిధంగా గత సమావేశాల్లో అమలు చేసిన పథకాలపై సమీక్ష, భవిష్యత్ పెట్టుబడుల ప్రణాళికలు, ప్రధాన సదుపాయాల అభివృద్ధి, విద్యా, రోడ్లు, రవాణా, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విభాగాల ప్రతిపాదనల ఆధారంగా కేబినెట్ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కొత్త ప్రాజెక్టుల అనుమతులు, కీలక పదవుల నియామకాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేబినెట్ సమావేశం అనంతరం, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు, వైసీపీ కౌంటర్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos