ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ముప్పిడి అవినాశ్‌రెడ్డికి అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ దాఖలైందని, కాబట్టి నిందితుడికి రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయాలని అవినాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. అయితే, ఈ వాదనతో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌ మాల్యా, జస్టిస్‌ విపుల్‌ పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించలేదు. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తర్వాత కూడా దర్యాప్తు సంస్థలు నిందితులను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అవినాశ్‌రెడ్డిని కస్టడీకి కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ట్రయల్‌ కోర్టు ఇచ్చే ఉత్తర్వుల కోసం వేచి చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ట్రయల్‌ కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జరగదని కోర్టు పేర్కొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos