ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు శనివారం ముగిశాయి. విద్య, ఉద్యోగ నియామకాలు, వ్యవసాయం వంటి కీలక రంగాలకు సంబంధించిన ఆరు ముఖ్యమైన బిల్లులకు సభ ఆమోదం తెలిపిన అనంతరం, ఛైర్మన్ మోషేన్ రాజు మండలిని నిరవధికంగా వాయిదా వేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు మండలి ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం, ఏపీ వర్సిటీల సవరణ బిల్లులకు కూడా సభ ఆమోదం లభించింది. ఈ చట్టాల ద్వారా ప్రైవేటు విద్యాసంస్థల పర్యవేక్షణ మరింత పటిష్టం కానుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లు కూడా ఆమోదం పొందింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, వేతనాల చెల్లింపులో మరింత పారదర్శకత తీసుకురావడమే ఈ బిల్లు లక్ష్యం. ఈ చట్ట సవరణలో భాగంగా, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించే ప్రతిపాదనకు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వ్యవసాయ, ఆర్థిక రంగాలకు సంబంధించి కూడా మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చే ప్రక్రియను సరళతరం చేసే బిల్లుకు ఆమోదం లభించింది. అదేవిధంగా, ఏపీ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లు-2025ను కూడా సభ ఆమోదించింది. సామాజిక సంస్కరణలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చట్టాల నుంచి 'కుష్టువ్యాధి' అనే పదాన్ని తొలగించే సవరణకు కూడా మండలి ఆమోదం తెలిపింది. ఈ కీలక బిల్లుల ఆమోదం అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos