వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాజమహేంద్రవరంలో తాజాగా కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసులు నమోదు చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 18 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు బెయిలుపై జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఈ నెల 19న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రాజమహేంద్ర వరం నుంచి గుంటూరు వరకూ సాగింది. అయితే రాజమహేంద్రవరంలో భారీగా కార్లతో ర్యాలీ నిర్వహించరాదంటూ పోలీసులు సెక్షన్ 30 కింద నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos