అమరావతి: జాతీయ విద్యావిధానం లక్ష్యసాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యానైపుణ్యాల అభివృద్ధి చేసేందుకు  శ్రీమతి సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఈ మేరకు సింఘానియా గ్రూప్ (రేమండ్స్), ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా తొలుత ట్రస్ట్ ఆధ్వర్యాన తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీషు శిక్షణ, జాతీయ విద్యావిధానంతో సమాంతరంగా, సాంకేతికత అనుసంధానం వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని తీసుకురావడం ద్వారా పాఠశాలల నిర్వహణలో మార్పులు తేవాలని నిర్ణయించారు. ఐదేళ్ల వ్యవధిలో అమలుచేసే ఈ కార్యక్రమం ద్వారా 1 లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ట్రస్ట్ సేవలను విస్తరిస్తారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రాబోయే విద్యారంగాన్ని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు అమలుచేస్తున్న మూస పద్ధతులకు స్వస్తిచెప్పి సృజనాత్మకత పెంపొందించేలా కెజి టు పిజి విద్య కరిక్యులమ్ లో సమూల మార్పులు తెస్తున్నామని చెప్పారు. కళాశాల నుంచి బయటకు వచ్చే విద్యార్థికి వెనువెంటనే ఉద్యోగం లభించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 

సింఘానియా గ్రూప్ చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా మాట్లాడుతూ... విద్యార్థులను ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యవంతంగా తయారు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. పిల్లలకు మరింత ప్రభావవంతమైన, ఆకర్షణీయమైన అభ్యసన విధానాల్లో బోధన చేసేందుకు వీలుగా ఉపాధ్యాయుల సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు విజయవాడ, వైజాగ్, అమరావతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాల్లో సాంకేతికతను సమగ్రపరచడం,  ఆంగ్లంలో విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలను బలోపేతం చేయడం ద్వారా విద్య నాణ్యతను పెంచడం ఈ సహకారం లక్ష్యం. ఉపాధ్యాయులను ఆధునిక సాంకేతికతతో సన్నద్ధం చేయడంతోపాటు డిజిటల్ సాధనాలను ఉపయోగించేలా శిక్షణ ఇస్తాం. ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలకు అవసరమైన అవసరమైన నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు తయారవుతారని అన్నారు.

సింఘానియా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరక్టర్ రేవతి శ్రీనివాసన్ మాట్లాడుతూ... విద్య ప్రగతికి పునాది, ఈ భాగస్వామ్యం ద్వారా స్థానిక తరగతి గదులకు ప్రపంచ ఉత్తమ పద్ధతులను పరిచయం చేయడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపాధ్యాయుల శిక్షణ, సాంకేతికతతో కూడిన అభ్యాసం, ఆంగ్ల ప్రావీణ్యంపై దృష్టి సారించాం. విద్యార్థులను విద్యాపరంగా సుసంపన్నం చేయడమే కాకుండా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యవంతమైన విద్యను పొందేలా చేస్తుంది. ఈ భాగస్వామ్యం అకడమిక్ ఎక్సలెన్స్, సమగ్ర అభివృద్ధిని పెంపొందించడానికి దోహద పడుతుంది. రాబోయే 5 సంవత్సరాలలో సింఘానియా గ్రూప్ విజయవాడ, కాకినాడ, విశాఖపట్నంలలో ఉపాధ్యాయ శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక అనుసంధానం వంటిపై శిక్షణ ఇచ్చి విద్యాస్థాయిని పెంచుతుందని అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos