ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాలను మూడేళ్లలోగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పనులు మొదలు పెట్టారు. అమరావతి నిర్మాణంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. రాజధాని అనుసంధానంలో కీలకమైన ఐకానిక్‌ కేబుల్‌ వంతెన నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఐకానిక్ కేబుల్ వంతెన డిజైన్‌ను ఇప్పటికే సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఇటీవల నాలుగు నమూనాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ప్రజల నుంచి ఓటింగ్‌కు పెట్టారు. అన్నింటి కంటే ఎక్కువగా దాదాపు 14,000 వరకూ రెండో ఆప్షన్‌కు ఓట్లు పడ్డాయి. దీని వైపే చంద్రబాబు కూడా మొగ్గు చూపారు. ఇందుకనుగుణంగా డీపీఆర్‌ కూడా సిద్దమైందని తెలుస్తోంది. ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో దీనికి అనుగుణంగా ఐకానిక్‌ వంతెన నమూనాను రూపొందించారు. స్వస్తిక హస్త భంగిమలో ఉండే కూచిపూడి నృత్య భంగిమ డిజైన్‌ ఇది. నమూనాలో స్థానికతకు పెద్ద పీట వేశారు. నిప్పన్‌ కోయి లిమిటెడ్‌ డీపీఆర్‌ను తయారు చేసింది. అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణా నదికి అవతల ఎన్‌హెచ్‌ 65 వద్ద ఎన్టీఆర్‌ జిల్లా మూలపాడు వరకు 5.22 కి.మీ పొడవున కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించనున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వంతెనను మూడు వరుసలుగా నిర్మిస్తారు. రెండు వైపులా కాలి బాటలు కూడా ఉంటాయి. మూలపాడు నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అమరావతిలోకి అడుగుపెట్టవచ్చు.

దీనివల్ల 35 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది. విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారి వద్ద వంతెన ముగియనుంది. ఇక్కడ తేలికగా అటు విజయవాడ వైపు, ఇటు హైదరాబాద్‌ వైపు మారేందుకు ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌ నిర్మాణం చేట్టనున్నారు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి వెళ్లేందుకు ఈ వంతెన సరికొత్త ప్రవేశ మార్గంగా సిద్దం చేస్తున్నారు. ఐకానిక్‌ వంతెన రాకతో ట్రాఫిక్‌ సమస్యలు తప్పుతాయని, మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయని సర్వ త్రా హర్షం వ్యక్తమవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos