అమెరికా-ఇజ్రాయెల్ మూకుమ్మడిగా దాడులు చేస్తున్నా తట్టుకుంటూ గల్ఫ్ దేశాలతో పాటు ఆయా దేశాల్లో ఉన్న వీరిద్దరి ఆస్తులపై ఇరాన్ (iran) ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ యుద్దం మొదలుపెట్టి ఐదు రోజులు గడుస్తున్నా.. కచ్చితంగా ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్దితిలోకి అమెరికా-ఇజ్రాయెల్ ను ఇరాన్ నెట్టేసింది. దీని వెనుక ఇరాన్ సాగిస్తున్న డ్రోన్ దాడులే కీలకంగా మారాయి. ముఖ్యంగా చౌకపాటి డ్రోన్ లతో ప్రత్యర్థుల భారీ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్న ఇరాన్ వ్యూహంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇరాన్ డ్రోన్ దాడులపై స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ముఖ్యంగా చిన్నపాటి ఆత్మహుతి డ్రోన్లతో ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడుల్లో అమెరికా-ఇజ్రాయెల్ కు చెందిన భారీ ఆస్తులకు ఎలా నష్టం వాటిల్లుతుందో వివరించారు. ఇరాన్ యుద్ధంలో, ఒక పాఠం స్పష్టంగా ఉందని, తక్కువ ధర "ఆత్మాహుతి" డ్రోన్‌లను అధిక ధర గల వాయు రక్షణ వ్యవస్థలను ముంచెత్తడానికి, ఖాళీ చేయడానికి ఉపయోగిస్తున్నారని సాయిరెడ్డి తెలిపారు. భారతదేశం ఈ మార్పును గమనించాలని సాయిరెడ్డి సూచించారు. పెద్ద, ఆధునిక డ్రోన్ ఆయుధశాల, బలమైన ప్రతి-డ్రోన్ సామర్థ్యాలను నిర్మించడం ద్వారా యుద్దానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సాయిరెడ్డి సలహా ఇచ్చారు. మామూలు పరిస్ధితుల్లో అయితే సాయిరెడ్డి ఇచ్చిన ఈ సలహాకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదేమో కానీ ఇప్పుడు అమెరికా - ఇజ్రాయెల్ పై ఇరాన్ చేస్తున్న డ్రోన్ దాడులు, గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ టర్కీ ఇచ్చిన డ్రోన్లతో పాకిస్తాన్ భారత్ పై చేసిన డ్రోన్ దాడుల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos