జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నేడు గురువారం అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు వెలగపూడికి చేరుకుని మధ్యాహ్నం 2.50 గంటలకు సాగునీటి సంఘాల సమావేశంలో పాల్గొంటారు. సాగునీటి సంఘాలు నీటి నిర్వహణ, నీటిని వృధా చేయకుండా ఎలా వినియోగించుకోవాలో వారికి దిశానిర్దేశం చేస్తారు. గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు ఇరిగేషన్ వ్యవస్ధ గాడి తప్పిందని, 18వేల కోట్ల రూపాయిల బిల్లుల బకాయిలను కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చారని చెప్పనున్నారు.

ఖరీఫ్ పంట ముగిసినా రాయలసీమలో సైతం, రిజర్వాయర్లలో పుష్కలంగా నీరుందంటే చంద్రబాబు వాటర్ మేనేజ్ మెంట్ వల్లే సాధ్యమైందని ప్రజలకు వివరించాలని చెప్పనున్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకుని, భూమిని కూడా రిజర్వాయర్ లా మార్చుకోవాలని, భూగర్భజలాలు పెంచుకోవాలని, కరువు రహిత రాష్ట్రంగా మార్చుకోవాలనేది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. నీటి భద్రత, వాటర్ మేనేజ్‌మెంట్, భూగర్భజలాల పెంపుపై సాగునీటి సంఘాలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారని సమాచారం. 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 12 వేల సాగునీటి సంఘాల అధ్యక్షులు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుండి సాగునీటి సంఘాల అధ్యక్షుల రాక ప్రారంభం అవుతుందని, జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.  సదస్సు  బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సుమారు 6 వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్‌ రద్దీ నివారణ దష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు, ట్రాఫిక్‌ డైవర్షన్‌ ప్లాన్‌ అమలు, ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలు కేటాయించినట్లు వారు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos