వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెబుతున్నా... తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుకింగ్ గడువు ఇప్పటికే పెంచేసారు. డెలివరీ మాత్రం ఆలస్యం అవుతోంది. యుద్ద కారణంగా భారీగా ధరలు పెంచినా.. సరఫరా మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో మెరుగు పడలేదు. బుకింగ్స్ పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. దీంతో.. వంట గ్యాస్ బుకింగ్ చేయాలంటే కొన్ని నిబంధనలు తప్పని సరి చేస్తూ తాజాగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బుకింగ్ గడువు పెంచిన కంపెనీలు ఇప్పుడు డెలివరీ కూడా ఆలస్యం చేస్తున్నాయి. కనీసం బుక్ చేద్దామన్నా కొన్నిసార్లు అవ్వడం లేదు. సరిపడా గ్యాస్​ నిల్వలు ఉన్నాయని.. ఆందోళన అవసరం లేదని ప్రభుత్వాలు చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. దీంతో, గ్యాస్ బుకింగ్​ సేవలను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి గ్యాస్​ బుక్​ చేయాలంటే ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అని చెబుతోంది. ఇది వరకు రాయితీ డబ్బుల జమ కోసం మాత్రమే ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉండగా, ప్రస్తుతం గ్యాస్ బుక్​ చేయాలన్నా ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. ఇందుకు ఈ నెల 31 వరకు గడువు విధించింది. అప్పటిలోగా వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.

కాగా, ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వినియోగదారులకు మరోసారి అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చేయని వారు మాత్రం ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని సూచిస్తుంది. వినియోగదారులు మీ-సేవ, గ్యాస్​ ఏజెన్సీలను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ కేవైసీ విధానం అమలు చేయటం ద్వారా వంట గ్యాస్ కష్టాల వేళ సరఫరా వ్యవస్థ పక్క దారి పట్టకుండా నియంత్రించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వంట గ్యాస్ సంస్థలకు చెందిన మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ-కేవైసీ ప్రక్రియను ఫ్రీగా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇందుకు ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరి. సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ప్రక్రియను పూర్తి చేసుకోవ చ్చని అధికారులు వెల్లడించారు. ఈ నెల 31 లోగా ఈ కేవైసీ పూర్తి చేయనివారు రాయితీతో పాటు గ్యాస్ బుక్ చేసే అవకాశాన్నీ కోల్పోతారని అధికారులు స్పష్టం చేసారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos