నేడు ఏపీ రాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవ వేడకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీలు, పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన నలుగురు విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావ్ గణపత్రావ్ జాదవ్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారా లోకేశ్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఇక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న వారిలో ఇప్పటి వరకు ఏపీ విద్యార్థులే అధికంగా ఉన్నారు. 2018-24 మధ్య ఎంబీబీఎస్ విద్యార్థులు 725 మంది చేరగా వారిలో సుమారు సగంమంది విద్యార్థులే ఉన్నారు.
కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు భారీ వాహనాలన్నీ ఇతర మార్గాల్లో వెళ్లాల్సి ఉంది. చెన్నై నుంచి వైజాగ్ వైపు వెళ్లే వాహనాలను గుంటూరు బుడంపాడు మీదుగా అవనిగడ్డ - పామర్రు - గుడివాడ - హనుమాన్ జంక్షన్ వైపుకు మళ్లించారు. వైజాగ్ నుంచి ఏలూరు, విజయవాడ, చెన్నై వెళ్లే వెహికిల్స్ హనుమాన్ జంక్షన్- గుడివాడ, పామర్రు, అవనిగడ్డ మీదుగా మళ్లించారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మీదుగా వెళ్లాలని జిల్లా పోలీసులు సూచించారు. వాహనదారులు ఈ హెచ్చరికలను గమనించి సహకరించాలని వారు కోరుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos