ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు‌కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. రాజ్యంగ బద్దమైన పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతున్నారని, టీవీ చర్చల్లో పాల్గొంటున్నారనే ఫిర్యాదు పైన రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రఘురామ పైన వచ్చిన ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖలో  సూచించింది.  దీంతో.. ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ లేఖ పైన ఏ విధంగా స్పందిస్తారనేది కీలకంగా మారింది.

రాజ్యాంగ ప‌ద‌విలో ఉంటూ పొలిటికల్ డిబేట్స్‌లో పాల్గొంటున్న రఘురామకృష్ణరాజుపై రాష్ట్రపతికి జేబీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ కుమార్ ఫిర్యాదు చేసారు. JBP ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించి.. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం సిఫారసు చేసింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి సీఎస్ కు పంపిన లేఖలో పిటీష‌నర్ ఇచ్చిన రిపోర్ట్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని JBP అధినేత జడ శ్రవణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్‌పై చర్యలకు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నట్లు ఆయన  వెల్లడించారు.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు తీసుకున్న వారు రాజకీయ పార్టీల కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. రఘురామ టీవీ చర్చల్లో పాల్గొనరాదని, రాజకీయ అంశాలపై ప్రత్యక్షంగా స్పందించకూడదని .. ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పార్టీ ఫిర్యాదు చేసింది. తాజాగా రాష్ట్రపతి కార్యాలయం సూచనతో రఘురామపై చర్యలు తీసుకోవాలని సిఫారసు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి స్పందన ఏంటనేది కీలకంగా మారుతోంది. మరోవైపు ఈ లేఖ పైన సీఎస్ తిరిగి రాష్ట్రపతి కార్యాలయానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos