ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింత వాతావరణం నెలకొంది. ఒకవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తుంటే, మరోవైపు వాతావరణ అనిశ్చితి వల్ల పలు జిల్లాల్లో వర్షాలు పలకరిస్తున్నాయి. నిన్నటి వరకు ఎండ వేడితో అల్లాడిన కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు వ్యాపించి ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎల్లుండి గురువారం నాటికి వర్షాల తీవ్రత పెరిగి, అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

నిన్న, ఇవాళ సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా, ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. అయితే, రాయలసీమలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సోమవారం అనంతపురంలో గరిష్ఠంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై, రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. వరుసగా కురిసే వర్షాల కారణంగా ఎండల నుండి సామాన్యులకు కొంత ఊరట లభించనుంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్ మరియు పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రైతులు తమ పంట కోతలపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos