ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అయితే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్వయంగా పలుమార్లు కేబినెట్ భేటీల్లో మంత్రులకు క్లాస్ తీసుకుంటూనే ఉన్నారు. అయినా పరిస్ధితిలో మార్పు రావడం లేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో రాష్ట్రంలో కేబినెట్ మంత్రులపై ఇవాళ అమరావతిలో జరిగిన హెచ్ఓడీల భేటీలో సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇవాళ బుధవారం భేటీలో మంత్రుల పనితీరుపై ప్రస్తావన వచ్చింది. దీనిపై స్పందించిన చంద్రబాబు.. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని తేల్చేశారు. చాలా మందికి తమ శాఖల్లో ఏం జరుగుతున్నదో తెలియడం లేదని సీఎం తెలిపారు. అలాగే మంత్రులు కేంద్ర నిధులు తేవడంలోనూ, వినియోగంలోనూ విఫలమయ్యారని చంద్రబాబు వెల్లడించారని సమాచారం.

కేంద్ర నిధులు తీసుకొచ్చేందుకు, వాటి కోసం చేసే లాబీయింగ్ కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్లడంలో నష్టం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు. ఇప్పటికే పలుమార్లు ఇవే అంశాలపై చంద్రబాబు మంత్రులకు కేబినెట్ భేటీల్లో క్లాస్ లు తీసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా తమ శాఖలపై మంత్రులు పట్టు పెంచుకోవాలని గతంలో ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే మంత్రులు చంద్రబాబు వ్యాఖ్యల్ని ఇప్పటికీ పట్టించుకోవడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos