మాజీ డీజీపీ ద్వారకాతిరుమలరావుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతల్ని అప్పగించింది. ఆయన ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించగా.. తాజాగా ప్రజా రవాణాశాఖ (పీటీడీ) కమిషనర్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేసింది. అంటే ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ బస్సులు, బస్టాండ్ల అంశాలతో పాటు ఉద్యోగుల వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తారు. ఏపీఎస్‌ ఆర్టీసీ పాలనా వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ద్వారకా తిరుమలరావు మూడేన్నరేళ్ల పాటూ ఆర్టీసీ ఎండీ అండ్ కమిషన్ పోస్ట్‌లో కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీ అయ్యారు.. జనవరి 31న రిటైర్ అయ్యారు. ఆ వెంటనే ఆయన్న ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది.. ఫిబ్రవరి 1 నుంచి ఏడాది పాటు ఆ బాధ్యతల్లో ఉంటారని ప్రభుత్వం తెలిపింది. అయితే పీటీడీ కమిషనర్‌ బాధ్యతలపై క్లారిటీ లేకుండా పోయింది.. కార్పొరేషన్‌ పరిధిలో బస్సులు, ఆస్తులు, ఉన్నాయి. పీటీడీ పరిధిలో ఉద్యోగులు, సిబ్బంది ఉంటారు. అదే ఆర్టీసీ ఎండీతో పాటుగా పీటీడీ కమిషనర్ పోస్టులో ఒక్కరే ఉంటే ఆపరేషన్స్‌కు, అడ్మినిస్ట్రేషన్‌ ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అందుకే ద్వారకా తిరుమలరావుకు ఆ రెండు బాధ్యతల్ని అప్పగించారు. గతంలో ఆర్టీసీ ఎండీగా పనిచేసిన అనుభవం ఉండటంతో సంస్థను లాభాల బాటలో నడిపిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం మాజీ డీజీపీ ద్వారకా తిరుమల రావుకు ఆర్టీసీలో కీలక బాధ్యతల్ని అప్పగించడంతో ఆర్టీసీకి సంబంధించిన అంశాలు, ఉద్యోగుల అంశాలపై ఆయన ఫోకస్ పెట్టనున్నారు. గతంలో అనుభవం ఉండటంతో అక్కడి సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos