ఏపీ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ విపక్ష వైసీపీ రచ్చ చేస్తున్న వేళ సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడ, విశాఖపట్నంలో రోడ్లను ప్రయోగాత్మకంగా పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.  ఈ రెండు నగరాల్లో కలిపి మొత్తం 112 కిలోమీటర్ల మేర రోడ్లను రూ.478 కోట్ల ఖర్చుతో చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొత్తం 56 పనులుగా వీటిని విభజించారు. వీటి కోసం మున్సిపల్ శాఖ త్వరలో టెండర్లు కూడా ఆహ్వానించబోతోంది. ఈ రోడ్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు పదేళ్లలో ఆ మొత్తం వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తారు.

విజయవాడ, విశాఖలో నగరపాలక సంస్థలు ఈ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 40 శాతం తొలి ఏడాది కాంట్రాక్టర్లకు చెల్లిస్తాయి. మిగతా 60 శాతాన్ని మాత్రం పదేళ్లలో వాటికి దశల వారీగా చెల్లిస్తాయి. దీని కోసం ప్రత్యేక ఎస్క్రో అకౌంట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భాగంగా రోడ్లతో పాటు ఫుట్ పాత్ లు, లైట్లు, ట్రాఫిక్ సైన్ బోర్డులు, బెంచీలు, చెత్తబుట్టలు, హాకర్ జోన్ల ఏర్పాటు కూడా చేస్తారు. పదేళ్లలో వీటి నిర్వహణ కూడా ఆయా సంస్థలే చూస్తాయి. ఈ విధానం విజయవంతమైతే రాష్ట్రంలోని మిగిలిన నగరాలు, పట్టణాల్లోనూ పీపీపీ విధానంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్ష వైసీపీ మెడికల్ కాలేజీల్ని పీపీపీ విధానంలో చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తుండటం, తాజాగా మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపిస్తూ కోటి సంతకాలు తీసుకుని గవర్నర్ కు సమర్పించడం తెలిసిందే.  ఈ నేపథ్యంలో విజయవాడ, విశాఖలో రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమైంది. తాజాగా సీఎం చంద్రబాబు .. రోడ్లను కూడా పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నప్పుడు మెడికల్ కాలేజీల్ని సైతం అదే విధానంలో చేస్తే తప్పేముందని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్య సంఘాల నాయకులు వైసీపీని ప్రశ్నిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos