రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జీజీయూ)లో ఈ నెల 8, 9 తేదీల్లో అంటే ఈరోజు, రేపు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారు. జీజీయూ కులపతి, చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణరాజు (చైతన్య రాజు) తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాలనే సంకల్పంతో రెండు రోజులు సభలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వర్సిటీ ప్రాంగణంలో నన్నయ, రాజరాజనరేంద్ర, వీరేశలింగం పేరిట వేదికలు ఏర్పాటు చేశారు. ఈ మహాసభలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలుగు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, న్యాయకోవిదులు, భాషా పండితులు, సినీ నటులు, రచయితలు హాజరవుతారు. సభల నిర్వహణకు 18 కమిటీలు ఏర్పాటు చేశారు. పద్య పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉన్నత పాఠశాల విద్యార్థులకు మహాసభల్లో బహుమతులు అందిస్తామని ఉపకులపతి డాక్టర్ యు.చంద్రశేఖర్ వెల్లడించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos