వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తనపై కేసు నమోదయి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయన తాడేపల్లికి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. తనపై నమోదయిన అక్రమ కేసులు, తన ఇంటిపై జరిగిన దాడి విషయాన్ని జగన్ కు వివరించారు. బెయిల్ పై విడుదలయిన అంబటి రాంబాబు జగన్ వద్ద జరిగిన విషయాలను తెలిపారు. అయితే అక్రమ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని అంబటికి జగన్ భరోసా ఇచ్చారు. కొందరు అధికార పార్టీకి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారని, వారిని కూడా వదిలి పెట్టేది లేదని తెలిపారు.

తర్వాత అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను అన్న మాటలకు క్షమాపణలు చెప్పానని, అయినా తాను చంద్రబాబును దూషించలేదని అన్నారు.  తాను క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా తన ఇంటిపై దాడి గంటల పాటు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. తాను కమ్మ సామాజికవర్గాన్ని పేరు పెట్టి దూషించానని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తాను అనని మాటలను అన్నట్లు రిమాండ్ రిపోర్టులో సీఐ పేర్కొనడాన్ని అంబటి రాంబాబు తప్పు పట్టారు. తనకు సినిమాను చూపించి మీరు విలన్లయ్యారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు సవాల్ విసిరారు. అసలు హీరో ఎవరో ఆలోచించుకోవాలన్నారు. అన్నింటికీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అంబటి రాంబాబు చెప్పారు.

కాగా కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తిని తాను కాదని నిరూపించుకోవడానికి అంబటి తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. తన కుటుంబంలోని ఎనిమిది మంది సభ్యులలో ఇద్దరు అల్లుళ్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారేనని ఆయన వెల్లడించారు. నా అల్లుళ్లు ఇద్దరు అదే సామాజిక వర్గం వారైనప్పుడు, నేను ఆ కులాన్ని ఎలా దూషిస్తానని అమాయకత్వం నటించారు. కానీ అంబటి రాంబాబును కాపు నేతగా వైసీపీ రుద్దేసిందన్న సంగతి ఆయనకు ఇంకా తెలిసి వచ్చినట్లుగా లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos