ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి 2024 - 25 విద్యా సంవత్సరానికి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదలయ్యింది. మార్చి నెలలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు గాను .. విద్యాశాఖ పరీక్షల తేదీలను వెల్లడించింది. మార్చి 17న మొదలు కానున్న పరీక్షలు మార్ఛి 31 లేదా ఏప్రిల్ 1 వరకు జరగనున్నట్లు తెలిపింది . పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. ఫిజికల్ సైన్స్, బయలాజీకల్ సైన్స్ సబ్జెక్టులకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని.. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది విద్యాశాఖ.
పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
మార్చి 17, 2025 (సోమవారం) ఫస్ట్ ల్యాంగ్వేజ్, ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష
మార్చి 19, 2025 (బుధవారం) సెకండ్ ల్యాంగ్వేజ్ పరీక్ష
మార్చి 21, 2025 (సోమవారం) ఇంగ్లిష్ పరీక్ష
మార్చి 22, 2025 (శుక్రవారం) ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2,
- OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 24, 2025 (సోమవారం) మ్యాథమెటిక్స్ పరీక్ష
మార్చి 26, 2025 (బుధవారం) ఫిజికల్ సైన్స్ పరీక్ష
మార్చి 28, 2025 (శుక్రవారం) బయోలాజికల్ సైన్స్ పరీక్ష
మార్చి 29, 2025 (శనివారం) OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, SSC ఒకేషన్ కోర్సు..
మార్చి 31 లేదా ఏప్రిల్ 1, 2025 (సోమవారం లేదా మంగళవారం) సోషల్ స్టడీస్ పరీక్ష
ప్రభుత్వ కేలండర్లో మార్చి 31వ తేదీన రంజాన్ సెలవు దినంగా ఉన్న క్రమంలో నెలవంక మార్చి 31వ తేదీన కనిపిస్తే అదే రోజు రంజాన్ ఉంటుంది కాబట్టి.. సాంఘిక శాస్త్రం పరీక్షను ఏప్రిల్ 1న నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos