ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టయి మధ్యంతర బెయిల్ పై ఉన్న వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో లొంగిపోయాడు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదన్న కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ గడువు నిన్న సాయంత్రం తో ముగియడంతో అతను లొంగిపోతాడా లేదా అన్నది సర్వత్ర ఉత్కంఠను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో లొంగిపోయాడు .తన తల్లి అనారోగ్యం పేరుతో బెయిల్ పొడిగించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఇక మద్యంతర బెయిల్ ని పొడిగించే ప్రసక్తే లేదని హైకోర్టు కూడా తేల్చి చెప్పింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు రాజమహేంద్రవరం కేంద్రకారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేయగా, బోరుగడ్డ అనిల్ బుధవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. ఆయన టీడీపీ నేతలను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వారి కుటుంబ సభ్యులను నోటికి వచ్చినట్టు, అనుచితంగా దూషించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే ఆయన ఈ కేసులో అరెస్ట్ అయ్యి కోర్టు రిమాండ్ విధించిన తర్వాత తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల బెయిల్ పొందాడు. దీనికోసం నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించినట్టు పోలీసులు నిర్ధారించారు. నకిలీ పత్రాలతో ఈ నెల 1వ తేదీ వరకు బోరుగడ్డ అనిల్ మద్యంతర బెయిల్ ను పొడిగించుకున్నారు. దీనిని మరో మారు పొడిగించుకోవడానికి ప్రయత్నం చేయగా హైకోర్టు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ పొడిగించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో ఆయన రాజమహేంద్రవరం జైలులో లొంగి పోవాల్సి వచ్చింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos