ఏపీలో ఈ నెల పదకొండో తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు వస్తారా లేదా అన్నదానిపై సందిగ్దత ఉంది. ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీని ఎదుర్కొనేందుకు భయపడుతున్నారు. ఎమ్మెల్యే పదవి పోతుందన్న భయంతో ఆయన ప్రమాణస్వీకారానికి వెళ్లి ముళ్ల మీద నిల్చున్నట్లుగా నిల్చుని ప్రమాణం చేసి కనీసం కూర్చోకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి హాజరవుతారా.. లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

ప్రజా తీర్పును గౌరవించడం రాజకీయ నాయకుడి మొదటి విధి. రాజకీయాల్లో ఎలాంటి పదవులు వచ్చినా అది ప్రజల భిక్షే. వారిచ్చిన. పాత్ర పోషించడానికి రెడీగా ఉంటేనే రాజకీయాల్లో ఉండాలి. అలా కాదు.. నేను కోరుకున్న పదవే ఇవ్వాలి అంటే సాధ్యం కాదు. వారిచ్చిన రోల్‌తో వారిని మెప్పించే ప్రయత్నం చేయాలి. కానీ జగన్ రెడ్డి అలా చేసేందుకు సిద్ధంగా లేరు. ఆయన ప్రభుత్వాన్ని ఫేస్ చేసేందుకు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధంగా లేరు. అసెంబ్లీలో పోరాడకుండా రోడ్ల మీద డ్రామాలు వేస్తే అది పోరాటం ఎలా అవుతుందని విమర్శలు వస్తున్నాయి.

చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేల్ని ఇచ్చినా ఆయన ప్రజాతీర్పును ఎప్పుడూ అగౌరవపర్చలేదు. అసెంబ్లీకి వెళ్లారు. అధికార మదంతో ఆయనను అవమానించినా తట్టుకుని నిలబడ్డారు. అందర్నీ సస్పెండ్ చేసి సభలో ఒక్కడ్నే ఉంచినా ధైర్యంగా నిలబడ్డారు. చివరికి ఆయన భార్యను.. కుటుంబాన్ని కూడా అనకూడని మాటలతో అవమానించడంతో కన్నీరు పెట్టుకుని శపథం చేసి వెళ్లారు. తననూ అలా చేస్తారన్న భయంతోనే జగన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ రెడ్డి పనితీరును ప్రజలు ఒక్క సారి చూశారు. మరో ముఫ్ఫై ఏళ్ల పాటు పీడకలలు వచ్చేలా పరిపాలించారు. ఆయన పనితీరు మర్చిపోవాలంటే ప్రతిపక్ష నేతగా ప్రజల కోసం ఆయన పోరాడాల్సింది చాలా ఉంది. అలా కాకుండా అసెంబ్లీకి రాకుండా పారిపోయి.. రోడ్ల మీద డ్రామాలు చేసి..శవాలున్న ఇళ్లలోనే అడ్డగోలు అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసగించేస్తానని అనుకుంటే అంత కంటే అమాయకులు ఉండరని రాజకీయ పరిశీలకులు ఉంటున్నారు. ఆయన ఇలాగే వ్యవహరిస్తే తన రాజకీయ భవిష్యత్తును తానే అంతం చేసుకున్న వారవుతారని వారు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos