సికింద్రాబాద్ జంక్షన్ నుంచి హౌరా జంక్షన్ కు రాకపోకలు సాగించే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు ఇవాళ భారీ ప్రమాదం తప్పింది. ఏపీలోని శ్రీకాకుళం సమీపంలోకి రాగానే ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి. అదీ మొత్తం రైలు సగానికి విడిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం మధ్యలోనే ఇలా విడిపోయింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, సిబ్బంది రైలును నిలిపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సూపర్ ఫాస్ట్ రైలు కావడం, ఇలా మధ్యలో బోగీలు విడిపోవడంతో భారీ ప్రమాదం జరిగినట్లు భావించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
బోగీలకు మధ్య తగిలించే కప్లింగ్ ఊడిపోవడం వల్లే రెండు భాగాలుగా రైలు విడిపోయినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు.శ్రీకాకుళంలోని పలాస సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తిరిగి బోగీలను జాయింట్ చేసే పనులను రైల్వే అధికారులు ముమ్మరంగా సాగిస్తున్నారు. అనంతరం రైలు తిరిగి బయలుదేరి వెళ్లనుంది. రెగ్యులర్ గా రాకపోకలు సాగించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ఇలా మధ్యలో కప్లింగ్ ఊడిపోయి బోగీలు ఎందుకు విడిపోయాయన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం ఉందా లేక విద్రోహ చర్య ఉందా అన్నది తేలాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos