ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటుగా మంత్రులు నారాయణ, నారా లోకేశ్‌లపై ఉన్న ఆరోపణలను కొట్టివేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేసులో ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారిస్తూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్‌ను న్యాయస్థానం ఆమోదించింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన ఈ కేసు అధికారికంగా మూసివేసినట్లు అయింది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, తమ వారికి లబ్ధి చేకూర్చేలా డిజైన్ మార్చారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ అప్పట్లో చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌లను నిందితులుగా చేర్చుతూ కేసు నమోదు చేసింది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు దర్యాప్తును సమీక్షించిన సీఐడీ, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిర్ధారణకు వచ్చింది. ఆరోపణలకు తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంటూ, 'మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్' (వాస్తవ దోషం) కింద కేసును మూసివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. సీఐడీ నివేదికను వ్యతిరేకిస్తూ, తన వాదనలు వినాలని కోరుతూ ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఆళ్ల పిటిషన్‌లో సరైన కారణాలు లేవని పేర్కొంటూ దానిని కొట్టివేసింది. అనంతరం సీఐడీ క్లోజర్ రిపోర్ట్‌ను ఆమోదిస్తూ కేసును మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే... ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, ఆయన దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ హైకోర్టు వాటిని కొట్టివేసింది. తాజాగా ఏసీబీ కోర్టు తీర్పుతో చంద్రబాబుతో పాటు ఇతరులకు ఈ కేసులో క్లీన్‌చిట్ లభించినట్లయింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos