ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి మరో విడత భారీ నిధులు అందనున్నాయి. మొదటి దశ అభివృద్ధి కోసం హామీ ఇచ్చిన రుణంలో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి రెండో విడతగా సుమారు 200 మిలియన్ డాలర్లను (దాదాపు రూ. 1700 కోట్లు) విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో రాజధానిలో నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి. అమరావతి మొదటి దశ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) చెరో 800 మిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 1600 మిలియన్ డాలర్లు (రూ. 13,600 కోట్లు) ఆర్థిక సాయం అందించేందుకు అంగీకరించాయి. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో తొలి విడతగా 207 మిలియన్ డాలర్లను విడుదల చేసింది. ఈ నిధులలో దాదాపు 50 శాతం మేర వివిధ పనులకు ఖర్చు చేసినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ తెలిపారు.

"ప్రపంచ బ్యాంకు నుంచి మాకు దాదాపు రూ. 1800 కోట్లు అందాయి. అందులో సగానికిపైగా ఖర్చు చేశాం. నిబంధనల ప్రకారం తొలి విడత నిధుల్లో 75 శాతం ఖర్చు పూర్తి కాగానే, రెండో విడత కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకుని, తదుపరి విడత నిధులను పొందాలని ఆశిస్తున్నామని" ఆయన పీటీఐకి వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాగా రూ. 1400 కోట్లను అందించనుంది. రాజధానిలో జరుగుతున్న పనుల పురోగతిని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందాలు ప్రతి నెలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాయని సురేశ్ కుమార్ పేర్కొన్నారు. సీఆర్డీఏ అధికారులతో సమావేశమై, రికార్డులను పరిశీలించి, పనుల నాణ్యతను తనిఖీ చేస్తున్నాయని తెలిపారు. పనుల అమలు తీరుపై ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదికలో పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు.

నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభం కావడం, పర్యావరణ-సామాజిక నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలను ప్రపంచ బ్యాంకు ప్రశంసించినట్లు నివేదికలో పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ రుణగ్రహీతగా వ్యవహరిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అమలు ఏజెన్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos