వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరుకు చెందిన జనసేన పార్టీ నేత అడపా మాణిక్యాలరావు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు. గుంటూరు మాత్రమే కాదు దువ్వాడపై రాష్ట్రంలోని వివిధ పోలీస్స్టేషన్లలో పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు అందాయి. మచిలీపట్నంతో పాటు గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు రూరల్ పోలీస్ స్టేషన్లలో స్థానిక జనసేన పార్టీ నేతలు దువ్వాడపై ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వైఎస్సార్సీపీ నేతల్ని వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పలు కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్నారు. ఇటు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కూడా వరుసగా కేసులు, పీటీ వారెంట్లతో అన్ని జిల్లాలకు తీసుకెళుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పోసానిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కర్నూలులో న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.
కర్నూలు జిల్లా ఆదోని త్రీటౌన్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ చేశారు. ఆదోని పోలీసులు గుంటూరు జైలులో రిమాండ్గా ఉన్న పోసానిని తమకు అప్పగించాలని జైలు సిబ్బందిని కోరారు. అక్కడ అనుమతి ఇవ్వడంతో అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల తర్వాత పోసానిని కర్నూలుకు తీసుకొచ్చారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే తనకు ఆరోగ్యం సరిగాలేదని.. అందుకే కర్నూలు హెడ్క్వార్టర్స్లోనే ఉంచాలని పోసాని జడ్జిని కోరారు. అనంతరం పోలీసులు ఆయనను కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. ఈ నెల 18 వరకు పోసాని కృష్ణమురళి రిమాండ్లో ఉంటారు. ఆయనపై ఇప్పటి వరకు 17 కేసుల వరకు నమోదయ్యాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos