కొవిడ్ కేసులు ఏపీని కలవరపెడుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాకు చెందిన ఓ మహిళకు కొవిడ్నిర్ధారణ అయింది. ఆమెని రిమ్స్లోని (Rims) ఐసోలేటెడ్వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రిమ్స్లో కొవిడ్ బాధితుల కోసం మొత్తం 20 బెడ్లను సిద్ధం చేసినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కొవిడ్ సోకిన మహిళ స్వస్థలం నంద్యాల జిల్లా చాగలమర్రి. ఆమె వయసు 70 ఏళ్లు. నాలుగు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆమెను వైద్యులు పరీక్ష నిర్వహించి కొవిడ్గా గుర్తించారు. నిన్న విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారించిన విషయం తెలిసిందే. కొవిడ్ కేసులు వ్యాప్తి చెందుతుండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు కీలక సూచనలు చేసింది. ప్రజలు గుంపులుగా గుమికూడదని, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అన్ని పబ్లిక్ స్థలాల్లో కొవిడ్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. దగ్గినపుడు, తుమ్మినపుడు చేతులు అడ్డు పెట్టుకోవాలని.. చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించింది.
ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ లో ఉండాలని.. వైద్యుల సలహాతో మందులు వాడాలని తెలియజేసింది. కాగా, 2020 - 21లో కొవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు తాజాగా నిన్న విశాఖపట్నంలో, ఇవాళ నంద్యాల జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos