అరటి రైతుల కష్టాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కిలో అరటి పండ్లను కేవలం 50 పైసలకే అమ్ముకుంటున్నారన్న జగన్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ఎక్స్ వేదికగా పూర్తి వివరాలను వెల్లడించింది. ఈ సీజన్ ప్రారంభమైన అక్టోబర్‌లో టన్ను అరటి ధర రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు పలికిందని ప్రభుత్వం తెలిపింది. నవంబర్ నెలలో గ్రేడ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉన్నాయని, నాలుగో వారం నాటికి ఏ-గ్రేడ్ అరటి టన్నుకు రూ.8 వేల నుంచి రూ.10 వేలకు, బి-గ్రేడ్ రూ.6 వేల నుంచి రూ.8 వేలకు, సి-గ్రేడ్ రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు అమ్ముడైందని వివరించింది. వాస్తవ ధరలు ఇలా ఉంటే, కిలో 50 పైసలని చెప్పడం సత్యదూరమని పేర్కొంది. అనంతపురం, సత్యసాయి, కడప, నంద్యాల జిల్లాల్లో సుమారు 34,000 హెక్టార్లలో అధిక వర్షాల వల్ల అరటి పంట దెబ్బతిన్న మాట వాస్తవమేనని ప్రభుత్వం అంగీకరించింది. అయితే, పరిస్థితిని ముందే అంచనా వేసి, కలెక్టర్ల ద్వారా వ్యాపారులు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహించామని పేర్కొంది. ఢిల్లీ, హర్యానా మార్కెట్లతోనూ సంప్రదింపులు జరిపినట్టు తెలిపింది.

ఈ చర్యల ఫలితంగా ఉత్తర భారతదేశ వ్యాపారులు ఏపీ నుంచి అరటి కొనుగోళ్లు ప్రారంభించారని, ఇప్పటికే కడప, అనంతపురం జిల్లాల నుంచి 700 మెట్రిక్ టన్నుల అరటిని ఉత్తరాదికి పంపామని వెల్లడించింది. గత వారం రోజుల్లోనే టన్నుకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ధర పెరిగిందని, రవాణా రాయితీ కోసం రైల్వే శాఖను కోరామని తెలిపింది. డిసెంబర్ రెండో వారం నుంచి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. వాస్తవాలు ఇలా ఉంటే, రైతులను నిరాశపరిచేలా ప్రకటనలు చేయడం సరికాదని జగన్‌కు హితవు పలికింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని రైతు సోదరులను కోరింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos